ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ IPL2020) 2020 షెడ్యూల్ (Schedule) వెలువడింది. మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనున్నది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, గత ఏడాది రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ప్రస్తుతానికి లీగ్ మ్యాచ్ల షెడ్యూల్నే విడుదల చేశారు. నాకౌట్ మ్యాచ్ల వివరాలను తర్వాత వెలువరిస్తారు. మే 17న ఆఖరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ జరిగే తేదీ కూడా ఖరారయ్యింది. మే 24న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.


తగ్గిన డబుల్ హెడర్ మ్యాచ్లు..
గతంతో పోలిస్తే ఈ సారి ‘డబుల్ హెడర్’ మ్యాచ్ల (ఒకే రోజు 4 గంటలకు, 8 గంటలకు రెండు మ్యాచ్లు) సంఖ్యను బాగా తగ్గించారు. ఈ సీజన్లో తొలి రోజు, చివరి రోజు మినహాయించి మిగిలిన ఆదివారాల్లో మాత్రమే డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగుతాయి. తాజా మార్పుల వల్ల లీగ్ మ్యాచ్లు జరిగే రోజుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 44 రోజుల్లో లీగ్ మ్యాచ్లను ముగిస్తుండగా, ఇప్పుడు అది 50 రోజులు కానుంది.
రాజస్తాన్ హోమ్ గ్రౌండ్పై వివాదం..
ఈ సీజన్లో రాజస్తాన్ మినహా మిగిలిన ఏడు జట్లు తమ సొంత వేదికలను కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి. రాజస్తాన్ మాత్రం జైపూర్తో పాటు రెండు మ్యాచ్లను గువాహటి వేదికగా నిర్వహించాలని యోచిస్తోంది. అయితే దీనిపై వివాదం కొనసాగుతోంది. రెండో నగరాన్ని హోమ్ గ్రౌండ్గా వాడుకోవడం కుదరదంటూ రాజస్తాన్ క్రికెట్ సంఘం అభ్యంతర పెడుతోంది. దీనిపై కోర్టులో కేసు కూడా దాఖలు చేసింది.

ఏప్రిల్ 1 నుంచి హైదరాబాద్లో మ్యాచ్లు..
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ హోమ్ మ్యాచ్లను ఎప్పటిలాగే ఉప్పల్ స్టేడియంలో ఆడుతుంది. హైదరాబాద్లోని ఉప్పల్లో ఈ ఏడు మ్యాచ్లు ఏప్రిల్ 1, 12, 16, 26, 30, మే 5, 12 తేదీల్లో జరుగుతాయి. ఏప్రిల్ 4, 7, 19, 21, మే 3, 9, 15 తేదీల్లో జరిగే తమ మ్యాచ్లను సన్రైజర్స్ ఇతర వేదికలపై ఆడనున్నది.