రాష్ట్రంలో కొత్త జిల్లాల సందడి మరింత ఊపందుకుంది. కొత్త జిల్లాలను ప్రకటించడమే కాదు హద్దులు, సరిహద్దులు స్పష్టంగా నిర్ణయించారు. అక్కడక్కడా మమ్మల్ని అటు మార్చండి ఇటు మార్చండి అంటూ నిరసనలు కనిపిస్తున్నా ఉగాదికల్లా కొత్త జిల్లాలు ఏర్పడడం తథ్యమైపోయింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఉగాదికల్లా కొత్త జిల్లాల్లో పని ప్రారంభం కావాల్సిందేనని ఆయన అధికారులను ఆదేశించారు….ఆరోజు నుంచే కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలు.. ఆ మేరకు సన్నాహకాలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు… ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలని సీఎం ఆదేశం… వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందన్న సీఎం… పరిపాలన సాఫీగా సాగడానికి వీరి అనుభవం ఉపయోగపడుతుందన్న సీఎం… New Districts in AP
కొత్త జిల్లాల ఏర్పాటుపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష సందర్భంగా సీఎం ఏమన్నారంటే…
– కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత… యంత్రాంగం అంతా సమర్థవంతంగా పనిచేయాలి
– కొత్త జిల్లాలో పని ప్రారంభమైన తర్వాత ఎలాంటి అయోమయం ఉండకూడదు, పాలన సాఫీగా ముందుకు సాగాలి
– దీనికోసం సన్నాహకాలను చురుగ్గా, వేగంగా, సమర్థవంతంగా మొదలు పెట్టాలి
– వచ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు కావాలి.
– ఉగాది నాటికి కొత్త జిల్లాల కలెక్టర్లు ,ఎస్పీలు … ఆయా జిల్లాకేంద్రాల నుంచి పనిచేయాలి
– ఉద్యోగుల విభజన, మౌలిక సదుపాయాల ఏర్పాటు, కొత్త భవనాలు వచ్చేలోగా యంత్రాంగం పనిచేయడానికి అవసరమైన భవనాల గుర్తింపు.. అన్నిరకాలుగా కూడా సిద్ధం కావాలి
– కొత్తగా మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యేలోగా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కావాల్సిన భవనాలు తదితర వాటిని గుర్తించాలి
– అలాగే కొత్త భవనాల నిర్మాణంపైనా ప్రణాళికలను ఖరారు చేయాలి
– అందుకోసం స్థలాల గుర్తింపుపై దృష్టిపెట్టాలి
– అభ్యంతరాల విషయంలో హేతుబద్ధత ఉన్నప్పుడు దానిపై నిశిత పరిశీలన చేయాలి
– నిర్ణయం తీసుకునేముందు వారితో మాట్లాడ్డం అన్నది చాలా ముఖ్యం
– దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తున్నాను
ఇప్పుడున్న కలెక్టర్లు, ఎస్పీలే కొత్త జిల్లాలకు…
ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలని సీఎం ఆదేశం
వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందన్న సీఎం
పరిపాలన సాఫీగా సాగడానికి వీరి అనుభవం ఉపయోగపడుతుందన్న సీఎం
– వీరు కొత్త జిల్లాల్లో మౌలికసదుపాయాలు, పాలన సాఫీగా సాగేందుకు వీలుగా సన్నాహకాలను పరిశీలిస్తారన్న సీఎం.
–స్థానిక సంస్థల (జిల్లాపరిషత్ల విభజన) విషయంలో కూడా అనుసరించాల్సిన విధానాన్ని న్యాయపరంగా, చట్టపరంగా పరిశీలించి తగిన ప్రతిపాదనలు తయారుచేస్తామన్న అధికారులు.
ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి(రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.